కోనసీమ: వైసీపీ రాష్ట్ర రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఆదివారం మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. బొత్స ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విజయనగరంలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలాని ఆకాక్షించారు.