ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ నెల 23న అనంతగిరిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకరరావు ఆదివారం తెలిపారు. ఈ రక్తదాన శిబిరం అనంతగిరి వెలుగు ఆఫీసులో జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో రక్త నిల్వలను పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు.