JN: తరిగొప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని(KGBV) కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదిని తనిఖీ చేసిన కలెక్టర్ వంట సామాగ్రి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులను సూచించారు.