WNP: జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సాయి చరణ్ రెడ్డిని ఘనపురం మండలం సల్కలాపూర్ స్వగ్రామంలో సత్కరించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తుల దుర్గయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆయనను శాలువాలతో సన్మానించారు. సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామానికి జిల్లా స్థాయి పదవి ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.