TG: గరీబ్ హఠావో.. ఒవైసీ బచావో అన్నట్లు కాంగ్రెస్ పాలన ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పేదల కోసం బఫర్ జోన్లు.. ఒవైసీ కోసం కంఫర్ట్ జోన్లు పెట్టారని తెలిపారు. అక్రమ కట్టడంలో చదివే పిల్లల సామాజిక కోణం పేదల బిడ్డల విషయంలో కనిపించలేదా అని నిలదీశారు. పేద కుటుంబాలపై బుల్డోజర్లు మెరుపు వేగంతో కదిలాయని.. సల్కం చెరువు వైపు మాత్రం వెళ్లడం లేదన్నారు.