MBNR: దేవరకద్ర సీనియర్ కాంగ్రెస్ నేత ఆది హనుమంత్ రెడ్డికి మాతృవియోగం సంభవించింది. అనారోగ్యం కారణంగా ఆయన తల్లి లలితమ్మ ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని లలితమ్మ భౌతికకాయానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం హనుమంత్ రెడ్డి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, మనోధైర్యం చెప్పారు.