నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఫరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద PCCF సువర్ణ బృందానికి F55 ఆడపులి దర్శనమిచ్చింది. క్షేత్రస్థాయి పర్యటనలో ఉన్న అటవీ అధికారులు అతి దగ్గరగా పులిని చూసి హర్షం వ్యక్తం చేశారు. అభయారణ్యంలో పులుల సంఖ్య పెరుగుతుండటం వన్యప్రాణుల సంరక్షణ చర్యల విజయానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.