NTR : నందిగామ పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ వారికి కృతజ్జతలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.