MHBD: పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మండలానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ.16,94,000 విలువైన చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.