KNR: సనాతన ధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి కోదండ రామాలయంలో 108 ఆలయాల అర్చకులకు అయోధ్యలో పూజలు చేసిన పట్టు వస్త్రాలను అందజేశారు. పాకాల రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.