MHBD: కురవి మండలం తిర్మలాపురం గ్రామంలో ఎస్ఐ గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకం, గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల నిషేధం, సిసి కెమేరాల ఏర్పాటుపై ఎస్ఐ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ కనకటి అచ్చమ్మవీరన్న, ఉపసర్పంచ్ దేవి శ్రీను, వార్డ్ సభ్యులు అయనను సన్మానించారు.