NRPT: ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లి మండలం అల్లిపురం గ్రామంలో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.