MNCL: పంట వేసిన ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొండ గొర్ల లింగన్న కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు వేసేందుకు ప్రభుత్వం అందించే రైతు భరోసా డబ్బులు ఇవ్వడంలో జాప్యం ఎక్కువగా జరుగుతుందన్నారు. దీంతో పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.