KKD: వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెల నుంచే ఎండల తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు.