NRML: మామడ మండలం చందరం–బండల్ ఖానాపూర్ అటవీ ప్రాంతంలో జింక ఒక్కసారిగా వాహనం ముందుకు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పొనకల్ గ్రామానికి చెందిన బి. భీమేష్ (35), వినీత్ (27), లక్ష్మి (50) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రలను వెంటనే ప్రథమ చికిత్స అందించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఈఎంటీ వై. సురేష్, పైలట్ హఫీజ్ సహకారంతో బాధితులకు సహాయం అందించారు.