జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. కలెక్టరేట్ ముందు ఉన్న టీ స్టాళ్లు, విజయ డైరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ జీవనం సాగిస్తున్న మహిళలు ఆందోళనకు దిగారు. తమ ఉపాధి దెబ్బతింటోందని ఆరోపిస్తూ కలెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.