ATP: గుత్తి కోటలోని కొండపై వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం అద్భుతం జరిగింది. స్వామివారి పాదాలను తొలి సూర్య కిరణాలు తాకాయి. ముందుగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.