AP: సైబర్ నేరగాళ్లు సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులనూ వదలట్లేదు. తాజాగా పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజు బ్యాంక్ ఖాతాపై సైబర్ అటాక్ జరిగింది. RTA ఛలానా పేరుతో బాలరాజు ఫోన్కు ఓ లింక్ రాగా.. దాన్ని ఓపెన్ చేయగానే ఆయన అకౌంట్ నుంచి రూ.12 లక్షలు కట్ అయ్యాయి. సైబర్ అటాక్ అని గుర్తించిన MLA వెంటనే జీలుగుమిల్లి(ఏలూరు జిల్లా) పోలీసులకు ఫిర్యాదు చేశారు.