MNCL: వాహనాలను అధిక వేగంతో నడిపితే వాహన దారులకు వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక FDO రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. అభయారణ్యం వన్యప్రాణులకు నిలయమన్నారు. దీంతో కవ్వాల్ అభయారణ్యంలో వేగ పరిమితి గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేయడం జరిగిందన్నారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లను కూడా ఏర్పాటు చేశామని FDO తెలిపారు.