MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ నిర్వహించారు. ఖేలో ఇండియా సైక్లింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకృతి రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు.