VKB: భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో చేర్చాలని ఎంఎస్పీ (MSP) జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై అవగాహన కోసం చేపట్టిన 23 రోజుల యాత్ర శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద యాత్రకు ఘన స్వాగతం పలికారు.