NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో పలుకూరు గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి అన్నారు.