శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో డీ. సత్యనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సంబంధిత అధికారులు, సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు.