BHNG: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో వినాయక చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురూపంగా ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్యం నిర్లక్ష్యం చూపిందన్నారు.