అన్నమయ్య: చిన్నమండెంలోని జిల్లావాండ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మండెం లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించారు. ప్రత్యేక పూజలు చేసి, ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.