RR: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆదిత్య నగర్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు.