NRML: రంజాన్ సందర్భంగా నిర్మల్ ఈద్గా వద్ద జిల్లా ఎస్పీ జానకి షర్మిల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈద్గా చౌరస్తా, బైంసా-మంచిర్యాల మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులకు సూచనలిచ్చారు. ప్రార్థనా స్థలాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.