NZB: పొతంగల్ మండలం కల్లూర్ ద్వారా అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను, యాజమానులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. శుక్రవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు.