AP: ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. CRDA కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల శాఖ కమిషనర్గా నియమించగా, ఆయన స్థానంలో విజయరామరాజుకు బాధ్యతలు అప్పగించింది. మార్కాపురం కలెక్టర్గా విజయ సునీత, పోలవరం జిల్లా కలెక్టర్గా దినేశ్ కుమార్ను నియమించింది. రవి సుభాష్కు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యతలు అప్పగించింది.