SDPT: కోహెడ మండల రైతుల కోసం ఈ నెల 21వ తేదీన రైతు మహోత్సవ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శన, సుమారు 150 ప్రదర్శన స్టాళ్ల వీక్షణ, రైతులు, శాస్త్రవేత్తలతో చర్చా గోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్నారు.