WGL: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దాతృత్వం వంటి మహత్తర విలువలను పెంపొందించే పవిత్ర కాలమని ఎంపీ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.