NLG: రాష్ట్ర బడ్జెట్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీలను దహనం చేశారు. విద్యారంగానికి కేవలం 8% నిధులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వర్సిటీ నియామకాలపై స్పష్టత లేదని నేతలు విమర్శించారు. ఓయూ మినహా ఇతర వర్సిటీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.