VSP: సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీినవాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలకు చెందిన 9 మందికి ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సీఎం సహాయనిధి ఎంతో వేగంగా అందుతోందన్నారు.