MDCL: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోకు మాత్రమే చెత్త వెయ్యాలని జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ప్రజలకు సూచించారు. ఘట్కేసర్ వ్యాప్తంగా అనేకచోట్ల విస్తృతంగా పర్యటించి, స్వచ్ఛ ఆటోలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నేడు గ్రౌండ్ లెవెల్ అధికారులు పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా కఠినంగా ఉంటుందన్నారు.