KNR: జిల్లా ఆసుపత్రుల్లో పరిశుభ్రతతో పాటు రోగులకు అందించే వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి వ్యాక్సిన్ గది, ఫార్మసీ, ల్యాబ్, లేబర్ రూమ్లను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.