BHNG: వలిగొండ మండల కేంద్రంలో సీపీఎం జిల్లా కమిటీ ఇంటింటి సీపీఎం సర్వే కార్యక్రమానికి చేపట్టారు. ఈ కార్యక్రమానిక రాష్ట్ర నాయకులు ఎండీ జహంగీర్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీలో సీఎంతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు రాజకీయ విలువలను కోల్పోయి దుర్భాషలాడుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇది రాజకీయాల్లో ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.