ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం నగరంలోని బాలల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదనంలోని వసతులు, పరిశుభ్రత, పిల్లలకు అందుతున్న ఆహార నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం శిశు సంరక్షణ కేంద్రంలోని చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీస్తూ, వారిపై నిరంతర వైద్య పర్యవేక్షణ ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.