SRPT: యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త హరిబాబును కఠినంగా శిక్షించాలని పీవోడబ్ల్యూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఇవాళ సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. అదనపు కట్నం కోసం గర్భిణీని చిత్రహింసలు పెట్టి చంపడం దారుణమని, నిందితుడికి బెయిల్ రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యదర్శి రేణుక కోరారు.