SRPT: పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులను కోరారు. శుక్రవారం పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగిసిపోయాయని, పాఠశాలలకు ఒంటిపుటబడులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలవలు, చెరువులు, బావులకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు.