NGKL: నాగర్కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామంలో రెండు రోజుల క్రితం మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారు శ్రీనివాస్ రెడ్డి మరణించడంతో ఇవాళ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.