గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం భారత్లోని పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. ఇప్పటికే పవర్ పెట్రోల్ రూ.2.30 పెరగగా.. తాజాగా ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటర్పై ఏకంగా రూ.22 పెరిగింది. దీంతో ఇప్పటివరకు రూ.87.57గా ఉన్న ఇండస్ట్రియల్ డీజిల్.. ధర పెరగడంతో రూ.109.56కి చేరింది. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు.