MNCL: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కరానికై ఈ నెల 24న డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు సామజిక సమస్యలపై క్యాంపెయిన్ చేయనున్నట్లు వెల్లడించారు.