KRNL: ఆస్పరిలో బొడ్రాయి స్థాపన పూజ కార్యక్రమం శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తలారి వెంకటేశ్వర్లు, సర్పంచ్ మూలింటి రాధమ్మ, మూలింటి రాఘవేంద్రతో పాటు గ్రామస్తులు, వార్డు సభ్యులు పెద్ద ఎత్తున హాజరై పూజల్లో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.