MLG: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి సీతక్క కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా నిలిచే పంచాయతీరాజ్ శాఖకు అత్యధిక కేటాయింపులు చేయడం, సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరు నిర్ణయం ఎంతో హర్షణీయమని స్పష్టం చేశారు.