BHNG: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సతీమణి శ్రీనిత శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమెతోపాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.