NLG: చిట్యాల మండలం వెలిమినేడులో రాచకాలువ మురికి కూపంగా మారి ప్రజలను వేధిస్తోంది. ఎన్నికల ముందు పాలకులు హామీలు ఇచ్చినా, అమలులో నిర్లక్ష్యం వహించడంతో కాలువ అంతా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు, గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీనివల్ల వస్తున్న దుర్గంధం, దోమల వ్యాప్తితో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. కాలువను ఆధునీకరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.