TG: గోదావరిలో ఐదుగురు గల్లంతవ్వడం అత్యంత విషాదకరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాల వెలికితీత చర్యలు వేగవంతం చేయాలని యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. కాగా, పోలవరం జిల్లా ఏటపాక మండలం కూనవరం వద్ద భద్రాచలానికి చెందిన ఏడుగురు స్నానం కోసం నదిలోకి దిగగా.. ఐదుగురు గల్లంతయ్యారు.