KNR: శంకరపట్నం మండలం మొలంగూరు శివారులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా వన్ వేలో వాహనాలను అనుమతించారు. వన్ వేలో వెళ్తున్న ఓ కారులో పెట్రోల్ అయిపోవడంతో వాహనం నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.