NDL: సంజామల మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సార్ బీసీ కాలువలో సాగునీరు వృథాగా పారుతోంది. పదో బ్లాక్ కాలువ వద్ద కృష్ణా జలాలు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం పంటలు నూర్పిడి దశలో ఉండటంతో నీటి అవసరం లేకపోయినా సరఫరా కొనసాగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలని కోరుతున్నారు.