MDK: రామాయంపేట పట్టణ బస్టాండ్ వద్ద ఏబీవీపీ నాయకులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరసనను నిలిపివేయాలని ఆదేశించడంతో పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ కో-కన్వీనర్ ప్రశాంత్ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.